రాజ్యసభలో ఈ రోజు ఓ ఎంపీ విద్యుదాఘాతానికి గురయ్యారు. సభ జరుగుతుండగా మైకు వైర్లు తగిలి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇతర సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ సీటు వద్ద ఉండే మైక్ నుంచి పొగలు రావడంతో, వైర్లు పట్టుకుని సరిచేయబోయిన బీజేపీ ఎంపీ కేజే ఆల్ఫోన్స్ కు కరెంట్ షాక్ తగిలింది.
దాంతో ఇతర సభ్యులు ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఆల్ఫోన్స్ తన సీట్లోంచి వెళ్లి మరో సీట్లో కూర్చున్నారు. ఈ విషయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి తెలియడంతో ఆయన సభను పావుగంట సేపు వాయిదా వేశారు. పొగలు వస్తున్న మైక్ ను సరిచేయాలంటూ రాజ్యసభ సిబ్బందిని ఆదేశించారు.
వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోట జగన్ సంతకం: చంద్రబాబు