తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఘోరం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఏకే-47 రైఫిల్తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపాడు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పారామిలటరీ దళానికి చెందిన శిబిరం వద్ద సోమవారం వారి సహోద్యోగి కాల్పులు జరపడంతోనలుగురు CRPF జవాన్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.
రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని మారాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగన్పల్లి గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 50వ బెటాలియన్ క్యాంపులో తెల్లవారుజామున 3.15 గంటలకు ఈ సంఘటన జరిగింది. జవాన్ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
గాయపడిన జవాన్లు ధర్మాత్మా కుమార్, ధర్మేంద్ర, మహారణ, ధనుంజయ్. మృతులు బిహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్కు చెందిన రాజుమండల్గా గుర్తించారు. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
.