telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉరేసుకుని బాలీవుడ్ హీరోయిన్ ఆత్మహత్య

preksh

లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలే కాదు సినిమా ఇండస్ట్రీ కూడా తీవ్రంగా నష్టపోయింది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. “కన్న కలలు చనిపోయినపుడు జీవితం చెత్తగా ఉంటుంది” అని చెప్పి తన ఇంస్టాగ్రామ్ లో సెల్ఫీ తీసుకొని దాని కింద క్యాప్షన్ ఇచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే హీరోయిన్ ప్రేక్ష మెహతా తండ్రి చూసి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఎందుకు చనిపోయింది అనే దానికి క్లారిటీ లేదు. ఆమె చివరి ఇంస్టాగ్రామ్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేక్ష మెహతా క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ, అక్షయ్ కుమార్ హీరోగా చేసిన పాడ్ మ్యాన్ సినిమాలో కూడా నటించింది. నటి ప్రేక్ష మరణంపట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేసింది.

Related posts