భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అలాగే సింగర్ గురు రాంధవాను ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్ ఫ్లై క్లబ్లో జరిగిన దాడిలో పోలీసులు అరెస్టు చేశారు. కానీ అనంతరం ఇద్దరినీ బెయిల్పై విడుదల చేశారు. ఈ దాడిలో ముంబై క్లబ్కు చెందిన ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 34 మందిని అరెస్టు చేశారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. సురేష్ రైనా మరియు గురు రాంధవా సహా 34 మందిపై సెక్షన్ 188, 269 కింద కేసులు నమోదుచేశారు. రాత్రి నిర్ణిత సమయం కంటే ఎక్కువ సమయం క్లబ్ ను తెరిచి ఉంచడం అలాగే కోవిడ్ నిబంధనలను పాటించనందుకు డ్రాగన్ఫ్లై పబ్ పై దాడి చేసిన తరువాత ఈ అరెస్టులు జరిగాయి. అయితే విమాన కదలికలపై ఆంక్షలు విధించడమే కాకుండా, బ్రిటన్లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనావైరస్ వేరియంట్పై పెరుగుతున్న ఆందోళనల మధ్య, ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను సోమవారం ప్రకటించింది. నూతన సంవత్సరానికి ముందు, మహారాష్ట్ర ప్రభుత్వం ముందు చర్యగా రాష్ట్రంలో మరియు ముఖ్యంగా ముంబైలో డిసెంబర్ 22 నుండి జనవరి 5 వరకు ప్రజా కార్యకలాపాలపై వరుస ఆంక్షలు విధించింది.
previous post
next post
పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం.. స్వామి భక్తిని చాటుకున్న బండ్ల గణేశ్