ఆధ్యాత్మికం గురువుగా చెప్పుకుంటున్న నిత్యానంద తన కోసం, తన అమాయక భక్తుల(అత్యాచార నిపుణులు) కోసం ‘కైలాస’ పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్నే సృష్టించుకున్న విషయం తెలిసిందే. దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం ఆ దేశ (కైలాస) న్యాయప్రతినిధులు ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలు పెట్టడం విశేషం! ఆ దేశానికి సంబంధించి ఇప్పటికే అధికారిక వెబ్సైట్ (కైలాస డాట్ ఆర్గ్) కూడా రూపొందించారు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఈ ద్వీపం ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్ నుంచి కొనేసుకున్న నిత్యానంద, ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి, సొంత జెండా, పాస్పోర్టు, జాతీయ చిహ్నం, రాజ్యాంగం.. ఇలా అన్నింటినీ రూపొందించుకున్నాడు.
దీనిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వస్తున్నాయి. సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేయడం ఏంటని..ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిత్యానందని ఆడేసుకుంటున్నారు. నిత్యానందపై సెటైర్లతో సోషల్మీడియా మోతమోగిపోతుంది. అయితే సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే టీం ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నిత్యానంతపై తనదైన స్టైల్లో సెటైర్ వేశాడు. ”వీసా రావడానికి ఏం చేయాలి?? లేదా అక్కడకు చేరుకున్నాక ఇస్తారా??” అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. దానికి ‘కైలాసా’ అనే హ్యాష్ట్యాగ్ని కూడా జత చేశాడు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ”అతను(నిత్యానంద) నీకంటే గొప్ప స్పిన్నర్” అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలాకాలం నుంచి అశ్విన్కు కేవలం టెస్ట్ జట్టులోనే చోటు దక్కుతుంది. వన్డేలు, టీ-20ల్లో అతనికి అవకాశం ఇవ్వడం లేదు. అయినప్పటికీ.. టెస్టుల్లో తనకు దొరికిన అవకాశాన్ని అశ్విన్ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ అతను మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు డిమాండ్ చేశారు.