ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగా తెలిపారు.
ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు.. అలా చేయడం వల్లే ఎంతో మంది ఎస్సీలకు ఉద్యోగాలు దక్కాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు అలా చేయకుంటే ఎస్సీల పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంద కృష్ణమాదిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజులకు తమ పోరాటం ముందుకు సాగుతుందంటే అందుకు కారణం నాటి చంద్రబాబు నాయుడు తీసుకు వచ్చిన చట్టమే కారణమని ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ వివరించారు.
ఈ ఉద్యమం ముప్పై ఏళ్ల పాటు ముందుకు సాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో మంద కృష్ణమాదిగ పై విధంగా స్పందించారు. అయితే ఈ వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్ట వద్దని ఆయన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు