telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భారతీయుడు-2” సెట్స్ లో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి

Bharatheeyudu-2

ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ సరసన కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం వరకు పూర్తి చేసుకుంది. కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు చెన్నై సమీపంలోని పూనమల్లి వద్ద మూవీ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ కోసం సెట్ వేస్తుండగా భారీ క్రేన్ విరిగిపడింది. ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్ కిందపడిన సమయంలో అక్కడే దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. అతి సమీపంలోని కెమెరా డిపార్ట్ మెంట్ దగ్గరే ఉన్న శంకర్ అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కమల్ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక చనిపోయిన వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, చంద్రన్ మృతి. ఈ ఘటనతో ఒక్కసారిగా తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

Related posts