telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేష్ ని క్రాక్ గర్ల్… అంటూ నిర్మాత పోస్ట్

Keerthy

‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇక ఈ అమ్మడు అటు తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది. అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే ‘ చిత్రంలోనూ నటిస్తుంది. కీర్తి మరో అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌ సరసన కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది కీర్తి. ప్రస్తుతం అందులో త్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తుంది. అందువల్ల తాను కూడా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో కీర్తి నవ్వుతూ, కళ్లు పెద్దవిగా చేసి చూస్తూ ఎవరికో హాయ్ చెప్తుంది. దానికి క్యాప్షన్ గా ” నా కళ్ళలో ఉన్న ఉత్సాహం నేను నిన్ను చూసినందుకా..! సప్నదత్, లేదా నా చివరి చెల్లింపు వచ్చినందున కావచ్చు! అని తెలిపింది. అయితే మహానటి సినిమా నిర్మాత అయిన సప్నదత్ ఈ పోస్ట్ కు స్పందిస్తూ… ఈ క్రాక్ గర్ల్ తన రెమ్యునరేషన్ కూడా సరిగా అడగదు’ అని తెలిపింది. ఇక ప్రస్తుతం కీర్తి తెలుగులో నితిన్ సరసన ‘రంగ్ దే’, మహేష్ ‘సర్కారు వారి పాట’లో నటిస్తుంది.

Related posts