telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించడానికే ఇదంతా చేస్తున్నారా?: సీతారాం ఏచూరి

seetharam echuri

జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నట్టుండి అమర్ నాథ్ యాత్రను ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి ఇదంతా చేస్తున్నారా? లేదా ఆర్టికల్ 35ఎ ను రద్దు చేసే క్రమంలో ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులను ఆమోదించారని అన్నారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసేలా కేంద్రం కొత్త చట్టాలను తీసుకొస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన 8 రంగాల్లో గత ఐదేళ్లలో కేవలం 0.5 శాతం అభివృద్ధి మాత్రమే జరిగిందని విమర్శించారు. ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.

Related posts