telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలే: సీపీఐ నారాయణ

Narayana cpi

ఏపీలో జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు.

బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అని అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని, విపక్షాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

Related posts