telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి: సీపీఐ నారాయణ సవాల్

CPI Narayana

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. అమరావతికి మద్దతుగా నేడు నారాయణ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్, బీజేపీ, గవర్నర్ అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని నారాయణ సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతిని అంగీకరించారని, అధికారంలోకి వచ్చాక మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారని విమర్శించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో కూడా గవర్నర్ వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. గవర్నర్ కు రాజకీయ విజ్ఞత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అమరావతి విషయంలో బీజేపీ కూడా ముద్దాయిగా నిలిచిందని చెప్పారు. అమరావతికి కన్నా లక్ష్మీనారాయణ అనుకూలమని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారని అన్నారు.

Related posts