telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రధాని మోదీ పిలుపు పై రామ్‌ చరణ్‌ ట్వీట్

ramcharan

ప్రధాని మోదీ పిలుపును గౌరవించి ప్రతి ఒక్కరు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దిపాలు వెలిగించాలని రాంచరణ్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘అందరికి నమస్కారం. లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో రేపు రాత్రి 9 గంటలకి తొమ్మిది నిమిషాల పాటు మన ఇళ్లలో ఉన్న లైట్లన్ని ఆపేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లేని భారత్‌ను సాధిద్దాం’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ప్రజలకు మెగా ఫ్యామిలీ ఎంతగానో తోడ్పాటుని అందిస్తూ వస్తుంది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు రామ్‌ చరణ్‌ తన వంతు సాయం రూ. 70 లక్షల విరాళం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చెప్పారు.

Related posts