telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

‘ఐసీఎంఆర్’ పరిశోధనలో కరొనాకు విరుగుడుగా ఎబోలా డ్రగ్

karona virus

కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’ డ్రగ్ కరోనాపై ప్రభావం చూపగలదని ఆయన అన్నారు. గిలియడ్ సైన్స్ ఇంక్ సంస్థ తయారు చేసిన ఈ ప్రయోగాత్మక మందు ప్రారంభ దశలో మంచి రిజల్ట్స్ చూపిస్తోందన్నారు. అటు వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లలో ఇద్దరికీ ఈ ‘రెమెడెసివర్‌’ డ్రగ్ పని చేసినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ ఓ నివేదికను ప్రచురించిందని గంగాఖేడ్కర్ తెలిపారు. ఎబోలా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’.. కోవిడ్ -19 వైరస్ మ్యుటేషన్‌పై పని చేస్తోంది. అందువల్లే పరిశోధకులు ఈ డ్రగ్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇది క్లినికల్ ట్రయిల్ కాదని.. కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ స్పష్టం చేశారు. కాగా, గిలియడ్ సంస్థ తయారు చేసిన ఈ డ్రగ్ ట్రయిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్ కూడా పాల్గొంటోంది.

Related posts