కరోనా వ్యాక్సిన్ గురించి ప్రధాని మోదీ వివరించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ.. మూడు రకాల కరోనా వైరస్ వ్యాక్సిన్లు ట్రయల్స్ దశల్లో ఉన్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. టీకాలను ప్రతి ఒక భారతీయుడికి అందే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
భారత్లో మొత్తం మూడు రకాల టీకాలుట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే ఆ టీకాలను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. అతి తక్కువ సమయంలోనే ప్రతి ఒకరికి టీకా అందేవిధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు మోదీ తెలిపారు.