తెలంగాణలో కరోనా వైరస్ హైద్రాబాద్ తో పాటు వివిధ జిల్లాకు కూడా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఆఫీసులో ఓ అధికారికి కరోనా సోకింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మరో ఐదు రోజుల పాటు కార్యాలయం మూసి ఉంటుందని తెలిపారు. అధికారులంతా సెలవులో ఉంటారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయం మొత్తం శానిటైజన్ చేయనున్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలో 05 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఎట్టిపరిస్థితుల్లో అవినీతిని సహించను: సీఎం జగన్