telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనా బారినపడుతున్న అధికారులు

Corona

తెలంగాణలో కరోనా రోజురోజుకు ఉగ్రరూపం దాల్చడంతో ఆయా శాఖల అధికారులు ఒక్కొక్కరుగా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న యాదాద్రి సీఈవోకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. ఆయన భార్య కూడా జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చినట్టు యాదాద్రి కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. దీంతో తాను కూడా వారం రోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.

మరోవైపు, హైదరాబాద్ రైల్వే డివిజన్ కార్యాలయం హైదరాబాద్ భవన్‌లో సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి కూడా కరోనా బారినపడ్డారు.ఆమెను కలిసిన 9 మంది రైల్వే అధికారులు, ఉద్యోగులను గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా రైల్వే అధికారులు ఆదేశించారు. వారం రోజుల క్రితం ఓ రైలు గార్డుకు కరోనా సోకగా, ఇది రెండో కేసు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ముందస్తు చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

Related posts