telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఒకే ఇంట్లో ఎనిమిది మందికి క‌రోనా

Corona

తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా.. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. దీంతో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్న‌ట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మమత వెల్ల‌డించారు

దీంతో అంద‌రినీ హోం ఐసోలేష‌న్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పెళ్లి కుమారుడు స‌హా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. పెళ్లి కూతురికి మాత్రం నెగిటివ్‌ వ‌చ్చింది.

Related posts