telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 462 మందికి పాజిటివ్

Corona

ఏపీలో చాపకింద నీరులా కరోనా విస్తరించడంతో అక్కడ రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా 462 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది.

ఆయా ఆసుపత్రుల నుంచి 129 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. అటు కర్నూలు జిల్లాలోనూ ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Related posts