దేశవ్యాప్తంగా కరోనా మహోగ్రరూపం దాల్చడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలోనే 15,968 కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసులు 4,56,183 కేసులు వచ్చినట్లయింది. ఇదే సమయంలో నిన్న 465 మంది పరిస్థితి విషమించి మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు పెరిగింది.
కరోనా వైరస్ సోకిన వారిలో 2.58 లక్షల మంది ఇంతవరకూ రికవరీ అయ్యారని, రికవరీ రేటు 56.7 శాతానికి చేరుకుందని కేంద్రం పేర్కొంది. మంగళవారం నాడు 2,15,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకరోజులో చేసిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదేనని తెలిపింది. ఇంతవరకూ 73.52 లక్షలకు పైగా టెస్ట్ లను చేశామని వెల్లడించింది.
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు