telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

గాంధీ భవన్‌ లో కరోనా కలకలం.. వారం రోజులపాటు మూసివేత!

Gandhin Bhavan Hyd

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా కేసులు నమోదు కావడంతో  నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా నగరంలోని గాంధీ భవన్‌లో కరోనా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఈ భవనంలో కరోనా వ్యాపించింది.

కంట్రోల్ రూములో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నేతలు పార్టీని వారం రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు.

Related posts