తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,071 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,17,143 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 927 కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 327 మండి కోవిడ్ బారిన పడ్డారు.