telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం..కొత్తగా 2,478 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,478 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో మృతి చెందారు. 2,011 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,994 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,02,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 866కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 267 మండి కోవిడ్ బారినపడ్డారు.

Related posts