telugu navyamedia
వార్తలు సామాజిక

కర్ణాటకలో విజృంభిస్తున్న కరోనా .. కొత్తగా 8,324 మందికి పాజిటివ్

Corona

కర్ణాటకలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం కొత్తగా 8,324 కొత్త కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,27,076కు చేరుకుంది. కొత్తగా 115 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 5,438కి చేరింది. కర్ణాటకఇక, బెంగళూరు అర్బన్ జిల్లాలో 2,993 కేసులు వెలుగు చూడగా 25 మంది మృతి చెందారు. నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,442కు పెరిగింది. కరోనా కారణంగా నగరంలో ఇప్పటి వరకు 1,911 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

Related posts