telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆసియాలో భారత్ అగ్రస్థానం

Corona

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో భారీగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలో చేరింది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,90,535కి చేరగా, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. 93,322 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,819 మంది భాదితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Related posts