telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,718 కేసులు నమోదు

Corona

తెలంగాణ‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. కేసుల తాజా వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,718 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,153 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,153 కు చేరింది. ప్రస్తుతం 28,328 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 129 కోవిడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. 

Related posts