telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. కొత్తగా 89,706 మందికి పాజిటివ్

corona covid

దేశంలో క‌రోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ పెద్దమొత్తంలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 89,706 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది.

దీంతో  దేశంలో కేసుల సంఖ్య 43,70,129కు చేరింది. అదే సమయంలో 1,115 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య మొత్తం 73,890కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది కోలుకున్నారు. 8,97,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,18,04,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

Related posts