దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో పట్టణాల్లోనే అధిక కేసులు నమోదు కాగా, ప్రస్తుతం గ్రామాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో దేశంలో 86,052 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది.
గత 24 గంటల సమయంలో 1,141 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 92,290కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 47,56,165 మంది కోలుకున్నారు. 9,70,116 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.