దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి విద్యా సంస్థల పునఃప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు.
ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.
ఓటమిని ఒప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు…