ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రెండున్నర లక్షలకు చేరుకున్నాయి. వైరస్ వల్ల టీనేజీ యువత కూడా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అదనమ్ గేబ్రియాసిస్ తెలిపారు. . ఎక్కువ శాతం మంది వృద్ధులే మరణిస్తున్నా.. వైరస్ మాత్రం యువత వల్ల వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. మాకేం కాదన్న ధోరణితో యువత ఉంటోందని, కానీ వారి వల్లే ఆ వైరస్ వాళ్లవాళ్ల ఇండ్లల్లోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వైరస్ ఛాయలు ప్రతి రోజూ ఓ కొత్త మలుపు తిరుగుతున్నట్టు టెడ్రోస్ తెలిపారు. వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే. కానీ యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. అందుకే అన్ని దేశాలు దాదాపు భారీ సమూహాలను నిలువరిస్తున్నాయి. యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. వారు మాత్రం హోస్ట్లుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.