telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్తగా 1,445 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 1445 కొత్తగా నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 62,252 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతిచెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 14,030కి చేరింది. ఇప్పటివరకు ఏపీలో 20,33,149 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1243 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 20,04,786 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 14,603 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,74,75,461 కరోనా
టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు

Related posts