telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కరోనా విశ్వరూపం.. 24 గంటల్లో 253 మందికి పాజిటివ్

Corona

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 253 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 82 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 84కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 4,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,034 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related posts