telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఈ రోజు కొత్తగా 1,439 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,856 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,439 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం జిల్లాలలో అత్యల్పంగా 8 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరోనా తో 14 మంది మృతి చెందారు. కృష్ణ లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, ప్రకాశం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం లలో ఒక్కొ క్క రు చొప్పున మరణించారు. ఇదే సమయంలో 1,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,26,042కి చేరుకుంది. ఇప్పటి వరకు 19,97,454 మంది కోలుకున్నారు. అలాగే ఇంతవరకు 13,964 మంది కరోనా వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల సంఖ్య 2,71,61,870 కు చేరిందని బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Related posts