telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి తన మంచి మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

akshay-kumar

దేశంలో విస్తరిస్తున్న కరోనా నుంచి దేశాన్ని రక్షించేందుకు నిధుల సేకరణ చాలా అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపుపై స్పందించిన అనేకమంది విపత్కర సమయంలో చేయూతనిస్తూ దేశానికి అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికే కిలాడీ అక్షయ్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్మ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. దీంతో కరోనా మహమ్మారిపై అక్షయ్‌ చేస్తున్న సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts