తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం ‘పొగరు’ అనే కన్నడ సినిమా చేస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంవహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే మాస్ మసాలా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో హీరోయిన్ రష్మికను హీరో ధ్రువ సర్జా టీజ్ చేయడం, దారుణంగా హింసించడం లాంటి సన్నివేశాలు చూపించడంతో ఈ ఇష్యూ రచ్చెకెక్కింది. ఓ వైపు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ విడుదలైన వారం రోజుల్లోనే ఈ పాటకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చినప్పటికీ, మహిళామణుల ఆగ్రహానికి గురవుతోంది. ఓ అమ్మాయిని ఇంత దారుణంగా ఏడిపించడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్లో హింసాత్మక ధోరణిని పెంపొందిస్తాయని పేర్కొంటూ వెంటనే ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. ఇప్పటికే సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఇలాంటి పాటలు మరింత ఊతమిస్తాయని పేర్కొంటూ ఈ పాటపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ ‘పొగరు’ సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న క్రమంలో కరోనా ఎఫెక్ట్, మహిళా సంఘాల డిమాండ్స్ చూసి దర్శకనిర్మాతలు తలపట్టుకుంటున్నారు.
next post