telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కాంట్రాక్టు ఉద్యోగుల.. జీతాలు పెంపు..

contract employees salaries increased

తెలంగాణ వాటర్‌బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్‌ కమిషన్‌ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వెరియబుల్‌ డీఏ పెంచుతున్నట్లు వాటర్‌ బోర్డు పీ అండ్‌ ఏ అధికారులు ఓ సర్క్యూలర్‌ జారీ చేశారు.

దీని ప్రకారం పెరిగిన వెరియబుల్‌ డీఏ కలుపుకుని నెలజీతం (స్కిల్డ్‌) కలిగిన కార్మికులకు రూ.13,057, పాక్షిక నైపుణ్యం (సెమి స్కిల్డ్‌) వారికి రూ.10,640, నైపుణ్యం (ఆన్‌ స్కిల్డ్‌) లేనివారికి రూ. 9,011.2లు రానుంది. పెరిగిన వెరియబుల్‌ డీఏను ఈ నెల వేతనంలో కలిపి చెల్లించడం జరుగుతుంది. వాటర్‌బోర్డులో పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యిమంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

Related posts