తెలంగాణ వాటర్బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్ కమిషన్ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వెరియబుల్ డీఏ పెంచుతున్నట్లు వాటర్ బోర్డు పీ అండ్ ఏ అధికారులు ఓ సర్క్యూలర్ జారీ చేశారు.
దీని ప్రకారం పెరిగిన వెరియబుల్ డీఏ కలుపుకుని నెలజీతం (స్కిల్డ్) కలిగిన కార్మికులకు రూ.13,057, పాక్షిక నైపుణ్యం (సెమి స్కిల్డ్) వారికి రూ.10,640, నైపుణ్యం (ఆన్ స్కిల్డ్) లేనివారికి రూ. 9,011.2లు రానుంది. పెరిగిన వెరియబుల్ డీఏను ఈ నెల వేతనంలో కలిపి చెల్లించడం జరుగుతుంది. వాటర్బోర్డులో పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు వెయ్యిమంది ఔట్సోర్సింగ్ కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
కేసీఆర్ ఇలాకలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ: కేటీఆర్