telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భాగ్యనగరం లో కొనసాగుతున్న కేటీఆర్ పర్యటన…

భాగ్యనగరం లో నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. భారీ వర్షాలు మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు వరుసగా ఆయన వివిధ కాలనీల్లో పర్యటిస్తూ వరద బాధితులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా మంత్రి నగరంలో పలు కాలనీల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాలకు ముంపుకు గురైన సికింద్రాబాద్ లోని లాలాపేట్  పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడి ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న పది వేల ఆర్థిక సహాయాన్ని మంత్రి కేటీఆర్ అందజేశారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు. కాగా .. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు.

Related posts