హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ బుదవారం తెల్లవారుజామున మరణించారని తెలిపారు. మృతుడిని ఈశ్వరయ్యగా గుర్తించారు. ఆయన శంషాబాద్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.