telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌, కేసీఆర్‌ సమావేశమై కుట్రలు: ఉత్తమ్

uttam congress mp

తెలుగు రాష్ట్రాల సీఎంలపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తామని జగన్‌ డిసెంబర్‌లోనే ప్రకటించారన్నారు. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమై కుట్రలు పన్నారని ఉత్తమ్ విమర్శించారు.

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం నుంచి నీటిని ఏపీకి తీసుకెళ్తే.. దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు.రేపు సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్టు ఉత్తమ్‌ పేర్కొన్నారు. జూన్ 2న ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ జేబులు నింపుకునేందుకే ప్రాజెక్ట్‌లు కడుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు.

Related posts