టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సాగునీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ రాకముందు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ పనికిరాని విషయాలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలో పడేశారని పేర్కొన్నారు.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు. వలస కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ సాయం చేసిందని పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు.
వపన్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్: షర్మిల