telugu navyamedia
Uncategorized

కాంగ్రెస్‌ నాయకున్ని కాల్చి చంపిన దుండగులు

gun fire

బీహార్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు రాకేశ్‌ యాదవ్‌ను ఇద్దరు దుండగులు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున వైశాలిలోని సినిమా రోడ్డులో చోటు చేసుకుంది. మీనాపూర్‌ గ్రామంలోని రాకేశ్‌ యాదవ్‌ ప్రతి రోజు ఉదయం తన ఇంటి నుంచి మార్నింగ్‌ వాక్‌ చేస్తారు.

సినిమా రోడ్డులోని ఓ జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వస్తాడు. జిమ్‌ వద్ద మాటు వేసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రాకేశ్‌ యాదవ్‌పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయి ఉన్న యాదవ్‌ను చికిత్స నిమిత్తం సఫ్దర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts