ప్రజల గొంతును బీజేపీ వినడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈరోజు అస్సాంలోని గౌహతిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. మీరెందుకు ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్ ప్రశ్నించారు.
బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని అన్నారు. అస్సామీ భాష, సంస్కృతిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడిని అడ్డుకోవాలన్నారు. అస్సాంను నాగపూర్ నడిపించదన్నారు. అస్సాంను చడ్డీ వేసుకునే ఆర్ఎస్ఎస్ వాళ్లు పాలించారని పేర్కొన్నారు.
తన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు..ఈటల సంచలన వ్యాఖ్యలు!