telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాంగ్రెస్ కు బీజేపీపై ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను నా ద్వారా… పద్మశ్రీ అవార్డుపై అద్నాన్ సమీ…!?

Adnan-Sami

ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అద్నాన్ సమీతో పాటు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్‌లకు కూడా పద్మశ్రీ వరించింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాకిస్థానీ అయిన అద్నాన్‌కి బీజేపీ పద్మశ్రీ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించింది. దీనిపై అద్నా్న్ స్పందిస్తూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాకు అవార్డు ఇచ్చింది. అప్పటికి నేను పాకిస్థానీ పౌరుడినే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. నాకు అందరూ ఇష్టమే. రాజకీయాలేమీ లేవు. కాంగ్రెస్ ఎజెండా మరేదో ఉంది. వాళ్లకు బీజేపీపై ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను నా ద్వారా తీర్చుకుంటున్నారు. వాళ్లు ఎంత అరిచినా నాకేం పర్వాలేదు. నేను అసలు పట్టించుకోను. నాకు అతిపెద్ద గౌరవం దక్కినందుకు చాలా సంతోషిస్తున్నాను. నన్ను, నా సంగీతాన్ని ప్రేమించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. పద్మశ్రీ పురస్కారం నాకు నా కుటుంబానికి గర్వకారణం. నా తండ్రి 1965లో జరిగిన యుద్ధంలో ఫైటర్ పైలట్‌గా పనిచేశారు. తన దేశం కోసం ఆయన చేయాల్సింది చేశారు. ఆయన దేశభక్తికి పాక్ ప్రభుత్వం సత్కరించింది. కానీ ఆయనకు వచ్చిన అవార్డులకు నాకు సంబంధం లేదు. నా జీవితంలో జరిగేవి ఏవీ ఆయనకు సంబంధించినవి కావు. నేనున్న ప్రొఫెషన్‌కు నేను న్యాయం చేశాను కాబట్టి ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించింది’’ అని తెలిపారు. పాకిస్థానీ అయిన అద్నాన్‌కు 2015లో భారత ప్రభుత్వం ఇక్కడి పౌరసత్వం ఇచ్చింది.

Related posts