మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు ఓడిపోయాక కేసీఆర్ ఒక్క ఫేస్ బుక్ పోస్టుకు స్పందించారనీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తే, సీఎం ఫామ్ హౌస్ నుంచి సెక్రటేరియట్ కు వస్తారని ఎద్దేవా చేశారు. ఓటు హక్కులేని పిల్లలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని పొన్నం ఆరోపించారు.
కులాల పేరుతో టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్ లో నిన్న నిర్వహించిన కేటీఆర్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని దుయ్యబట్టారు. కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ ను తిరస్కరించబోతున్నారని తెలియడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు సభలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా నగదును పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే మంత్రి అవుతారని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అసలు వినోద్ ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
“ఆయుష్మాన్ భవ”ను తెలంగాణలో అమలు చేయడం: ఎంపీ ధర్మపురి అరవింద్