నా తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నేతల సమావేశంలో వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరని అన్నారు. ఎందరో ప్రముఖుల కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారని కోమటిరెడ్డి చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పెంచిన పెన్షన్లపై హడావుడి చేస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నల్గొండ జిల్లా సమస్యలపై కేంద్ర మంత్రులను కలిశానని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసిందని ఆరోపించారు.