telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

అందుకే అమిత్‌ షాకు స్వైన్‌ఫ్లూ సోకింది!

బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా స్వైన్‌ ఫ్లూ జ్వరంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు బీకే హరిప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడం వల్లే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ సోకిందని ఎద్దేవా చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తే కేవలం స్వైన్‌ ఫ్లూనే కాదు.. వాంతులు, విరేచనాలు వస్తాయని అన్నారు. 
కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగివచ్చారు. దీంతో అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ జ్వరం  వచ్చిందన్నారు. దీంతో కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు హరిప్రసాద్‌పై విరుచుకుపడ్డారు. ఫ్లూ జ్వరానికి చికిత్స ఉందనీ, కానీ హరిప్రసాద్‌కున్న మానసిక అనారోగ్యాన్ని తగ్గించడం కష్టమని గోయల్‌ విమర్శించారు.

Related posts