కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగలనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ కానున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు గులాబి కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఈ నెల 24వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిన నేపథ్యంలో, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడనుండటం కాంగ్రెస్ కు శరాఘాతమే.
కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ప్రతపక్ష హోదాను సైతం ఆ పార్టీ కోల్పోనుంది. ఈ ముగ్గురు కారెక్కిన తర్వాత శాసనసభలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు మాత్రమే. మరోవైపు టీఆర్ఎస్ బలం 104కు చేరనుంది.
అమరావతిలో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చు: ఎమ్మెల్యే గంటా