telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్ రెడ్డి లేకుండా.. పీజేఆర్ తనయుడి ఇంట్లో కాంగ్రెస్ నేతల మీటింగ్

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేకుండా ఈ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

ఈ సమావాేశానికి సీనియర్ నేతలు వి. హనుమంతరావు, జగ్గారెడ్డి, మధుయాష్కి, మర్రిశశిధర్ రెడ్డి, కోదండరెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలకు విష్ణువర్థన్ రెడ్డి ఆహ్వానం పంపారు.

ఇటీవల విష్ణువర్ధన్ రెడ్డి సోదరి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది.

తనకు తెలియకుండా చేర్చుకోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా తన నియోజకవర్గం పరిధిలో ఎవరినైనా ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

దీనిపై మాట్లాడేందుకు సీనియర్ నేతల‌తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన‌ట్టు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

Related posts