*శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్గాంధీ..
*రాహుల్కు స్వాగతం పలికిన రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క..
*రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ జోష్..
*రాహుల్ గాంధీ ఏ ప్రకటన చేస్తారన్న ఆసక్తి నెలకొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి రాహుల్గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
కాసేపట్లో హైదరాబాద్ హెలికాప్టర్లో హనుమకొండకు బయల్దేరనున్నారు. వరంగల్లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు.
వరంగల్లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు. ఈ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనుంది. అక్కడి మైదానం ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలతో ముస్తాబు అయింది. రాహుల్ పర్యటన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.