telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ చట్టం చేశారు.. కేటీఆర్ రద్దు చేశారు: జీవన్ రెడ్డి ఫైర్

jeevan-reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జఠిలమైందని అన్నారు. డీజిల్ ధర పెంపు, బస్ పాస్ రాయితీల ద్వారా ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం పాలు చేస్తున్నారని విమర్శించారు.

ఆర్టీసీకి ఆర్థికంగా సపోర్ట్ చేసే నిమిత్తం జీహెచ్ఎంసీ నుంచి రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆరే చట్టం చేశారని, ఏడాది తర్వాత ఆ చట్టాన్ని కేటీఆర్ రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంతి అయ్య కేసీఆరా? లేక ఆయన కొడుకు కేటీఆరా? అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts