తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పై ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీపై విమర్శలు గుప్పించడం, తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీ బీజేపీయే అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే కోమటిరెడ్డి మరికొందర్నీ కాషాయ కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఫిరాయింపుల చట్టం వర్తించదన్న వాదనలపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. మొత్తానికి చూస్తే కోమటిరెడ్డికి షాకివ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.